అమరావతి : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మాదిరిగానే ఏపీ సీఎం జగన్ కూడా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని సీపీఐ నాయకుడు నారాయణ సూచించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలో జరుగుతున్న సీపీఐ మహాసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ బంధాలు తెంచుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటున్నా యని ఆరోపించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రంలో ఒకమాదరి, ఢిల్లీలో మరో మాదరిగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉన్న జనరల్ ఆస్పత్రులను ఆదానికి కట్టబెట్టే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.