అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలతో యుద్ధం జరుగుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తెలిపారు. చంద్రబాబుకు తోడుగా మరో ముగ్గురికి దత్తపుత్రుడు పవన్కల్యాణ్ తోడై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
రాష్ట్రంలో నేరుగా యుద్ధం జరగడం లేదని కుట్రలు, కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంతో మారీచులు యుద్ధం చేస్తున్నారని అన్నారు. ప్రజల నమ్మకం, ఆశీస్సులు, దేవుడు దయ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమి చేయలేరని పేర్కొన్నారు. ప్రభుత్వం ఖర్చుచేస్తున్న ప్రతిపైసా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేస్తున్నామని వెల్లడించారు. తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్పై దృష్టిని సారించాలని , పిల్లల్ని బాగా చదివిస్తేనే వారి జీవితాలు మారతాయని అన్నారు.