అమరావతి : ఏపీ ప్రభుత్వం తనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీతం ఇచ్చి ఖాళీగా ఉంచినా ప్రజాధనం వృథా అయినట్లేనని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏబీవీపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడంతో ఇవాళ ఏపీ సెక్రటేరియట్కు వచ్చి జీఏడీలో రిపోర్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాలతో ఏపీ సెక్రటేరియట్కు వచ్చి జీఏడీలో రిపోర్ట్ చేశానని, సీఎస్ శమీర్శర్మను మాత్రం కలవలేదని వెల్లడించారు.
తాను చట్టప్రకారం మాత్రమే ముందుకెళ్లా నని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని సుప్రీం కోర్టుతో స్పష్టమైందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న జీతం విషయంపై సీఎస్ను కలుద్దామనుకున్నానని తెలిపారు. చాలా మందిని వీఆర్లో ఉంచి జీతాలివ్వడం లేదని ఏబీవీ అన్నారు. జీతం ఇవ్వకుంటే హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేయాలని సూచించారు. తనకు ఎలాంటి పోస్టింగ్ ఇస్తారో తెలియదని తెలిపారు.
ఏపీ ఇంటలిజెన్సీ విభాగంలో అధికారి పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీవీపై విచారణ జరిపి సస్పెన్షన్ చేశారు. దీంతో కోర్టులో పిటిషన్ దాఖాలు చేసిన మేరకు ఇరువర్గాల మధ్య జరిగిన వాదోపవాదాల తరువాత హైకోర్టు, సుప్రీం కోర్టు ఏబీవీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో నిన్న ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ను తొలగించింది.