అమరావతి : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంపై స్పందించారు. గౌతంరెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆయన ఇకలేరన్న వార్త వినడానికే బాధగా ఉందని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా స్నేహంగా మెలిగేవారని అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేవారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయమని బాలకృష్ణ అన్నారు.