అమరావతి: కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈనెల 16 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10వేల టికెట్లు జారీ చేయనున్నామని తెలిపారు. శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళమిచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమనా సేవా టికెట్లు అందించనున్నట్లు తెలిపారు.
టీటీడీ వెబ్సైట్ ద్వారా ఉదయాస్తమాన సేవా టికెట్లు బుకింగ్కు పోర్టల్ను ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. ఆన్లైన్ ద్వారా కూడా విరాళమిచ్చి ఉదయాస్తమాన సేవ టికెట్ పొందవచ్చని ఆయన సూచించారు.