అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. ప్రమాదాల తర్వాతైనా మేలుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈనెల 4న విశాఖ వాసి సుబ్బారావు గుంత కారణంగా మరణించగా అతడి కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో ఆ గుంతను పూడ్చడం ప్రభుత్వా్నికి సిగ్గుచేటని అన్నారు.
సుబ్బారావుకు జరిగిన రోడ్డు ప్రమాద స్థలం వద్ద ఈనెల 6న మరో వ్యక్తి అదే గుంతలో పడి గాయపడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నాయకులకు అధికారమిచ్చి, పన్నుల రూపంలో డబ్బులు కట్టి చివరకు చేయాల్సిన పని కూడా ప్రజలే చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.