అమరావతి : ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ రాజకీయ నాయకుడు తన బదులు మరొకరిని పంపడంపై కోర్టు(Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలోని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్రెడ్డి (Srinivas reddy) ధర్నా కేసులో మంగళవారం కోర్టుకు హాజరు కావలసి ఉండగా తన బదులు డ్రైవర్ను పంపించాడు.
కోర్టు ముందు హాజరైన డ్రైవర్ను చూసి జడ్జి మండిపడుతూ అసలు వ్యక్తి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. సాయంత్రం వరకు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతడి అనుచరులు, పోలీసులు శ్రీనివాస్రెడ్డికి సమాచారం అందించడంతో హుటాహుటినా కోర్టుకు చేరుకుని జడ్జి ముందు హాజరయ్యారు. దీంతో జడ్జి ఆ ప్రజాప్రతినిధి భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.