అమరావతి: ఇండిగో విమాన సంస్థ ఏపీ ప్రజలకు తీపి కబురు అందించింది. కడప నుంచి ఐదు నగరాలకు తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 27న కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సంస్థ వివరించింది. దేశంలో72 నగరాలకు ఇండిగో విమానాలు సేవలు అందిస్తున్నాయని 73వ అనుసంధానంగా కడప నగరం నిలవనుందని తెలిపింది.