అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ( Gannavaram ) ఎయిర్పోర్టులో ఇండిగో విమానం (IndiGo flight ) అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది . హైదరాబాద్కు బయలు దేరడానికి గన్నవరంలో టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అక్కడే ఎమర్జెన్సీగా నిలిపివేశారు.
ఈ విమానంలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవి( Minister Gottipati Ravi ) , ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, మరో 70 మంది ప్రయాణికులున్నారు. సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణాన్ని రద్దు చేయడంతో మంత్రి, ఎమ్మెల్యేలు రోడ్డుమార్గాన బయలు దేరారు.