తిరుమల : తిరుమలలో ( Tirumala ) మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం ( Silathoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా 32,951 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.