తిరుమల : తిరుమల(Tirumala)లో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 22 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (Ttd)అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 57,737 మంది భక్తులు దర్శించుకోగా 24,090 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi income) రూ 3.28 కోట్లు వచ్చిందని తెలిపారు.
వాచీలు, మొబైల్ ఫొన్ల వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫొన్లను మార్చి 7వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి .
వివో, నోకియా, కార్బన్, సాంసన్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ న్లు వున్నాయి. కొత్తవి, ఉపయోగించిన ,పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 22 లాట్లు, మొబైల్న్లుఫొ 18 లాట్లు ఈ-వేలంలో ఉంచామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో, కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు.