తిరుమల : రేణిగుంట విమానాశ్రయంలో (Renigunta airport) ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani tickets ) సంఖ్యను టీటీడీ 100 నుంచి 200 కు పెంచింది.ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో (Airport Counter) మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుంచి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. కాగా ఈ విధానం రేపటి నుంచి అమలులోకి రానుందని , భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.