తిరుపతి : తిరుపతి(Tirupati) సమీపంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు((Sri Vedanarayanaswamy Brahmotsavam) )విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
మే 4వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న గరుడసేవ, మే 11న రథోత్సవం, మే 12న ఉదయం చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు (Ttd officials)తెలిపారు. నిన్న స్వామివారిని 61,050 మంది దర్శించుకోగా 22,996 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.55 కోట్లు వచ్చిందని వివరించారు.