అమరావతి : అక్రమ మద్యం సరఫరాపై ఏపీ పోలీసులు సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా విక్రయిస్తున్న వారిని పట్టుకుని వారి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక మద్యాన్ని అక్రమదారులు కొత్త కొత్త మార్గాల్లో రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. దీంట్లో భాగంగా కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖల అధికారుల ఆధ్వర్యంలో మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఆలూరు –మొలగవల్లి గ్రామల మధ్య పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ సహాయంతో వాటిని ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.