అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ. 6.7 కోట్ల విలువగల బంగారాన్ని, నాలుగు కోట్ల నగదును పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది. ఆర్టీసీ బస్సులు, కార్లు, రైళ్లలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఏలూరు, కాకినాడ. విశాఖ, నెల్లూరు, చిలకలూరిపేట, సూళ్లూరుపేట లో తనిఖీలు నిర్వహించి రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.