అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు దహనం చేశారు. కొన్ని రోజులుగా ఆరు జిల్లాలో పోలీసులు, ఆబ్కారీ శాఖ ల ఆధ్వర్యంలో తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 457 కేసుల్లో 66 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వీటిని ఏపీలోని కాకినాడ జిల్లా కిర్లంపడి మండలం జగపతినగరం వద్ద ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం దహనం చేశారు. దీని విలువ రూ.13 కోట్లు ఉంటుందని డీఐజీ వెల్లడించారు. గంజాయి రవాణా గాని గంజాయి సాగుగాని చేసినట్లయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.