అమరావతి : ఓ కేసు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించ లేదని ఆరోపిస్తూ గుంటూరు మున్సిపల్ కమిషనర్ (Guntur Muncipal commissinor) కు ఏపీ హైకోర్టు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకుని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ను నడుపుతున్నారంటూ ఓ వ్యక్తి హైకోర్టు(High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్పై విచారించిన హైకోర్టు పిటిషనర్కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయడం లేదని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని పిటిషనర్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్ను విచారించిన కోర్టు గుంటూరు కమిషనర్ కీర్తి చేకూరికి నెలరోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రెండువేల జరిమానా చెల్లించాలని, జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.