విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీ విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నానికి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు నానీ తెగేసి చెప్పినట్లు ప్రచారం. ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కూడా పోటీ చేయబోదని చంద్రబాబుతో నాని చెప్పారంటున్నారు.
ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్కు వెళ్లిపోయిందని కేశినేని అన్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు కేశినేని వివరించారు. విజయవాడ లోక్సభ స్థానానికి ఈసారి వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు ఆయన సూచించారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చానని కేశినేని చెప్పారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఉన్నా.. నానీ అటువైపే తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వివాదం.. ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు కేశినేని నానీ దూరంగా ఉన్నారని అంటున్నారు. తనపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేసినా టీడీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై నానీ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితుల కథనం.