అమరావతి : ఏపీలో పోటీ చేసే ధైర్యం లేక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి బాలాజీ డైరీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్కు ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని సవాలు విసిరారు.
రాష్ట్రంలో పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ను ఓడించలేరని స్పష్టం చేశారు. మతాన్ని, కులాన్ని చూపించి ఓట్లు అడుగుతున్నారని పవన్ను విమర్శించారు. అధికారం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా అధికారంలోకి రావడం కలేనని అన్నారు.