అమరావతి : ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోకాల్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎంపీ ఓ మహిళతో మాట్లాడిన వీడియో కాల్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంపై ఆయన మాట్లాడారు . ఎంపీ మాధవ్ చెబుతున్నట్లు వీడియోలో ఉన్నది మార్ఫింగ్ కాదని తేలితే పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇలాంటి వాటిని పార్టీ సహించదని తెలిపారు. నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ వీడియో వ్యవహారంపై మాధవ్ పోలీసులకు , సైబర్క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని అన్నారు. ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. మహిళా పక్షపాతిగా తమ పార్టీ ఉంటుందని, మహిళలపై తప్పుడు పనులు చేస్తే క్షమించే పార్టీ కాదని అన్నారు.