అమరావతి : నూతన సంవత్సర ( New Year ) వేడుకలకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో 30 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. గుంపులుగా తిరగరాదని, రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని విజయవాడ నగర సీపీ కాంతిరాణా టాటా (CP Kanthi Rana Tata ) స్పష్టం చేశారు.
జనవరి 1న ఎంజీ రోడ్డు, బందర్రోడ్డు పైవంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. కొవిడ్ (Covid) దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 31వ తేదీ రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి చోటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామని ఆయన వెల్లడించారు.