అమరావతి: ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ పురపాలక పాఠశాలలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆయన ఈసందర్భంగా తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం ఇరు పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమాయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ తో విపరీతంగా కేసులు పెరుతున్నాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా తీసుకోవాఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.