విజయవాడ: ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపితే.. ఇతర చిన్నారులకు ఆదర్శంగా ఉంటుందని చెప్తున్న మాటలను నిజం చేశాడాయన. తన ఇద్దరు పిల్లల్ని పటమటలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపించినట్లు ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి తెలిపారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని, అందుకే తాము ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నామని ఆమె అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు, తరగతి గదులు, ఆట స్థలం అన్నీ చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాప్ ఎండీగా పనిచేస్తున్న ప్రభాకర్రెడ్డి.. గతంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. గతేడాది విజయవాడ పడమట ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్త విద్యార్థులు చేరుతారని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ఇలాఉండగా, వేసవి సెలవుల తర్వాత ఏపీలో ఇవాల్టి నుంచే పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.