విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నది. వీటిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో విశాఖలో యాంటీ నార్కొటిక్స్ సెల్ అప్రమత్తమైంది. మత్తు పదార్థాలు గోవా నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుతున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతుండటం, దాన్ని తీసుకెళ్లి గోవా వంటి ప్రాంతాల్లో ఎక్స్ చేంజ్ రూపంలో మత్తు బిళ్లలను విశాఖకు తీసుకొస్తున్నారు. గంజాయి సాగు చేసే ప్రాంతాలతో పాటు సరఫరా చేస్తున్న ఏరియాలపై నిఘా పెట్టి ఏడుగుర్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నది. వీరి నుంచి 8 వేల మత్తు ట్యాబ్లె్ట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మత్తు ట్యాబ్లెట్లు తీసుకుంటూ పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు.
మరోవైపు మెడికల్ రిలేటెడ్ డ్రగ్స్ నిల్వను విశాఖ హార్బర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఒక ఇంటిలో అధిక మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.