అమరావతి : ఏపీలో నెలకొన్న వర్ష భీబత్స పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్బాబు స్పందించారు. వర్ష ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, తదితర జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఏపీ సీఎం జగన్ కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాతావరణ హెచ్చరికలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతోనే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఏరియల్ సర్వేపై మాట్లాడుతూ గాల్లో వెళ్లితే ప్రజల వరద కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశించారు.
వర్షాలకు దెబ్బతిన్న రాయలసీమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జనాల కష్టాలు చూడని జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవడంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని లోకేశ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పొంచి ఉన్న వరద ముప్పును పట్టించుకోకుండా.. వ్యాపార లావాదేవీలు, పారిశ్రామికవేత్తలతో కమీషన్ల భేటీలు జరపటం సిగ్గుచేటని పేర్కొన్నారు.