అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 69 ని జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో బుక్ మై షో, మల్టీప్లెక్సులు విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేసింది.
రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఈ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. టికెట్ విక్రయం ద్వారా సర్వీసు ఛార్జీ కింద వచ్చే రూ.2లో ప్రభుత్వానికి రూ.1.97వెళుతుందని, తమకు కేవలం మూడు పైసలు మాత్రమే వస్తుందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు.