Hetero | విశాఖపట్నం, మార్చి 4: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో గ్రూపు..ఆంధ్రప్రదేశ్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. వచ్చే రెండేండ్లలో ఫార్మాస్యూటికల్స్, ప్రత్యేక బిజినెస్ను విస్తరించడానికి రూ.1,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ బండి తెలిపారు.
వైజాగ్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన మాట్లాడుతూ..కరోనా తర్వాత ఫార్మా ఉత్పత్తుల్లో విదేశాలకు భారత్ ఆశాకిరణంగా నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇందుకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ నూతన పెట్టుబడులతో ఏపీలో 3 వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయ న పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న హెటిరో గ్రూపు..అంతర్జాతీయ హెచ్ఐవీ మెడిసిన్స్ సరఫరాలో సంస్థ కు 40 శాతం వాటా కలిగివున్నది.