అమరావతి : హీరో కార్తికేయ దంపతులు శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కార్తికేయ ఇటీవల లోహితారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా దంపలిద్దరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు. వివాహం జరిగిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు నటుడు కార్తికేయ తెలిపారు.
అదేవిధంగా మరికొందరు ప్రముఖులు కూడా దైవ దర్శనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.