అమరావతి : తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్తో హెరిటేజ్ ( Botsa Satyanarayana ) సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ఆరోపించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని విమర్శించారు.
రూ. 320కి కొనుగోలు చేసే నెయ్యి రూ.700 కు పెంచడం వెనుక కారణం తెలియాలని అన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ ఈసెం పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు . అసెంబ్లీలో చర్చకు రావాలని కోరితే ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని ఆరోపించారు.
రైతుల గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని , నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మంత్రి లోకేష్ అసెంబ్లీలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హోంమంత్రి ఆమెకు ఇచ్చిన స్కిప్ట్ను చదువుతున్నారని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి సొంతగా సంపదను పెంచుకుంటున్నారని వివరించారు.