అమరావతి : కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి బ్యారేజీకి 2.31 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 70 గేట్లను ఎత్తి 2 లక్షల 22 వేల క్యూసెక్కులను సముద్రంలో విడుదల చేస్తున్నారు. కాలువలకు 9,689 క్యూసెక్కులు వదులుతున్నారు.
పులిచింతలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. కేవలం 8 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి కోసం 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 43.92 టీఎంసీలుగా ఉంది.