అమరావతి : నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను ఏపీలోని పల్నాడు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నరసారావుపేట మండలం రావిపాడు వద్ద వాహనాల తనిఖీలో సుమారు 10 లక్షల విలువగల 85 బస్తాల గుట్కా, 14 మద్యం సీసాలను మినీవ్యానులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.