కవాడిగూడ, ఏప్రిల్ 16: ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన హనిత వేములపాటి దివ్యాంగులరాలైనప్పటికీ సివిల్ సర్వీసెస్లో 887 ర్యాంకుతో సత్తా చాటారు. తాను టెన్త్ వరకు వైజాగ్, ఇంటర్ ప్రిడ్జీలో చదివానని చెప్పారు.
2012లో ఐఐటీ ఖరగ్పూర్లో చదువుతున్న సమయంలో స్పైనల్కార్డ్ సమస్యల వల్ల రెండు కాళ్లు పోయాయని మీడియాకు వెల్లడించారు. ఐఐటీని వదిలేసి నిరాశ చెందకుండా ఇగ్నో దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి త ల్లిదండ్రులు రాఘవేందర్రావు, ఇందిర ప్రోత్సాహంతో సివిల్స్ ప్రిపేర్ అయ్యాయని చెప్పారు. నాలుగోసారి 887 ర్యాంకు సాధించినట్టు తెలిపారు. సివిల్స్ సాధించడం తనకెంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు.