అమరావతి : ప్రకాశం జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువ భాగాన నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుకు చెందిన మూడో గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది . గత రెండు రోజుల నుంచి ఈ గేటు మరమ్మతుకు గురికావడంతో దిగువనకు నీరు వృధాగా పోతోంది. గేటు మరమ్మతులకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వరద ఉద్ధృతికి రాత్రి మూడో గేటు కొట్టుకుపోయింది.
స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో 13, 14, 15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి వత్తిడిని అధికారులు తగ్గించారు. ఇప్పటికే 12వేల క్యుసెక్కుల నీరు సముద్రం పాలైందని అధికారులు తెలిపారు. దీర్ఘకాలంగా గేట్ల నిర్వహణ, మరమ్మతుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఇరిగేషన్కు చెందిన మాజీ అధికారులు తెలిపారు.