(Gun Misfire) కృష్ణా : మచిలీపట్నంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చేతిలో పేలడంతో హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది.
మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాం వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వై శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. దాంతో శ్రీనివాసరావుకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని మెుదట జిల్లా దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ఎస్పీ సిదార్థ్ కౌశల్ విచారణకు ఆదేశించారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..