ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో గుజరాత్కు చెందిన 19 మంది కిలాడీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దకాకాని ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద ఈ అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని, వాహనదారులను అడ్డగిస్తున్నారు. యువతుల అందాలను చూసి, వాహనదారులు ఆగిపోతున్నారు. ఇలా ఆపి, పిల్లల పేరిట డోనేషన్ అంటూ వాహనదారుల నుంచి దోచుకుంటున్నారు.
మొదట్లో ఇది స్వచ్ఛందంగానే జరిగినా… రానూ రానూ ఇది బలవంతపు వసూళ్లలాగా మారిపోయింది. దీంతో వాహనదారులు అలర్ట్ అయ్యి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గుజరాత్ యువతులను పట్టుకోడానికి పోలీసులు పలు ప్రయత్నాలు చేశారు. చివరికి… ఓ ప్లాన్ ప్రకారం ఈ 19 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏఏ ప్రాంతాల్లో ఇలా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.