APPSC | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించా రు. గ్రూప్-1లో 100, గ్రూప్-2లో 900 పోస్టులను భర్తీచేస్తామని తెలిపారు.
గ్రూప్1 ప్రిలిమ్స్ ఫిబ్రవరి లో నిర్వహించే అవకాశం ఉన్నదని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు.