అమరావతి: పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ రేపు నిర్వహించనున్న “చలో విజయవాడ”కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీగా ఉద్యోగులు బయలుదేరారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర చేస్తూ “వుయ్ వాంట్ జస్టిస్” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.