తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా బుధవారం గోవిందరాజస్వామి సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కొనసాగింది.
ఉదయం శ్రీభు సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల (Tirumala) పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని, ఉదయం 6.35 గంటల నుంచి స్వామివారు రథంపై, రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.