అమరావతి : ఏపీలో మంత్రివర్గ పునర్వ్యీవస్తీకరణలో భాగంగా మంత్రుల రాజీనామాను ఆదివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు 24 మంది రాజీనామా ను ఆమోదించారు. దీనికి సంబంధించిన గెజిట్ను గవర్నర్ రాత్రి వరకు విడుదల చేయనున్నారు. మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్ బాషా, సుచ రిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, బాలి నేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్, గమ్మనూర్ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.