అమరావతి : అల్లూరి సీతారామరాజు జిల్లా శివలింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్గఢ్లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు కిరండోల్- విశాఖ మార్గంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగాయి . దీంతో పట్టాల పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
ఈ మార్గంగుండా విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును అధికారులు రద్దు చేశారు. ఘటనా విషయం తెలుసుకున్న రైల్వే డీఆర్ఎం సత్పతి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశమున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.