అమరావతి : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా గుర్తు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన(Janasea Party) పార్టీకి గుడ్న్యూస్ లభించింది. జనసేనకు తమకంటే ముందుగా గాజుగ్లాస్(Gaju glass) కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణకు రాగా పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జనసేన నాయకుల ఉత్కంఠతకు తెరపడింది.