విశాఖపట్నం: వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి.
ఈ కార్యక్రమాన్ని ఈశాన్య యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్యూసీఈఈ), సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ (ఎన్యూసీఈఎం), స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఇన్స్టిట్యూషన్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎన్ క్రిష్ వెల్లడించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు రూ. 30 లక్షల వరకు నగదు, గ్రాంట్లు లభిస్తాయని ప్రకటించారు. ఆరుగురు విద్యార్థులు అమెరికాలోని బోస్టన్ని సందర్శించి ‘ఇండియా@75 ఈవెంట్-2022’ , ఈశాన్య విశ్వవిద్యాలయంలో ఇమ్మర్షన్ ప్రోగ్రాంకు హాజరు కావడానికి స్పాన్సర్షిప్ అందుతుందని ఆయన తెలిపారు.
భారతదేశంలోని ఏదైనా విద్యా సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో చేరిన ప్రస్తుత విద్యార్థులందరికీ, 2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులు ఈ స్మార్ట్ఐడియాథాన్లో పాల్గొనవచ్చని వీడీసీ డిప్యూటీ డైరెక్టర్ మనేష్ వారియర్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆహారం, వ్యవసాయం, క్లీన్/గ్రీన్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్, హెల్త్ టెక్ & అసిస్టివ్ టెక్నాలజీ, వాటర్ మేనేజ్మెంట్ డొమైన్ నుంచి ఐడియాస్ ఉండాలని వెల్లడించారు. ఈ నెల 10 వ తేదీలోపు bit.ly/3O3IjMX వెబ్సైట్లో ఆలోచనలను సమర్పించాలని ఆయన తెలిపారు. అత్యున్నతంగా ఉన్న32 బృందాల ఆలోచనలను గీతంలో వచ్చే నెల 10, 11 తేదీల్లో ప్రదర్శిస్తారని ఆయన చెప్పారు.