అమరావతి : కృష్ణా జిల్లా మచిలిపట్నం ఆదర్శనగర్లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు నిందితులు. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటిలో ఉన్న బాలికను బెదిరించి, బలవంతంగా కొద్ది దూరంలోని వంతెన వద్దకు తీసుకెళ్లి ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు.
ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన సోదరుడికి నిందితుల వివరాలను తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.