అమరావతి : పరిశ్రమలు,ఐటీ శాఖ సహచర మంత్రి మరణం కలచివేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు.
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడానికి విశేషమైన కృషి చేశారన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.