తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ(Garuda vahana seva) అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి(Malayappa swamy) గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ ప్రాముఖ్యత సంతరించుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.
గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని అన్నారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని స్వామివారు బోధించారని పేర్కొన్నారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబు, వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.