తిరుమల : గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహించిన గరుడ వాహనసేవలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్వో నరసింహ కిశోర్, ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు, బాలిరెడ్డి, పారు ఫతేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.