అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ఎంపీగా పనిచేస్తున్నాడని టీడీపీకి తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి తాము పెద్ద దిక్కుకాదని, చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కని స్పష్టం చేశారు. తన అనుచరులకు స్వేచ్ఛ ఇచ్చానని, ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చని సూచించానని తెలిపారు. రాజకీయాల్లో చేయని పదవీ లేదు,చూడని రాజకీయం లేదని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా కు చెందిన గల్లా అరుణకుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోఓడిపోయారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా కొనసాగిన ఆమె 2019 ఎన్నికల్లో నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నాటి నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నారు.