అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ(GAD) మంత్రుల పేషీలకు (Ministerial cells) కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న వెలువడ నున్న ఎన్నికల ఫలితాల(Results) కు ఐదురోజుల ముందుగా జీఏడీ ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతుంది. జూన్ 2న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకోవాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి, అనుమతి పత్రాలు (Papets) బయటకు తీసుకెళ్లొద్దని, మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు తరలించేందుకు వీల్లేదని సూచించింది. జూన్ 3న మంత్రులే పేషీలకు తాళాలు వేస్తామని తెలియజేసింది. కార్యాలయం నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ (Vehicle Checks) చేయాలని ఎస్పీఎఫ్(SPF) సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీలు తమ గదులను ఖాళీ చేయాలని జీఏడీ ఆదేశించింది.