అమరావతి : రేపు నిర్వహించనున్న పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసుకుంది. జేష్ఠ్యాభిషేకం ముగింపు వేడుకల సందర్భంగా గరుడ సేవను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 93,400 మంది భక్తులు దర్శించుకోగా 39,451 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు వచ్చిందని తెలిపారు. కాగా 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 6 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవను నిర్వహించారు.