అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహించి ఆ బాధ్యతలను నెరవేరుస్తానని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు తెలిపారు. కేబినెట్ పునర్వవస్థీకరణ విషయంలో జగన్ సూచనను స్వాగత్తిసున్నానని వెల్లడించారు. ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకోవడం సహజమే అయినప్పటికీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావని అన్నారు.
ప్రభుత్వానికి ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు తాము భయపడడం లేదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు జగన్నే కోరుకుంటున్నారని అన్నారు. ఎక్కువ సీట్లు తమకే వస్తాయని టీడీపీ చెప్పుకున్నా ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదని తెలిపారు.